బాధితురాలికి అప్పగించిన కార్పొరేషన్ కార్మికులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని జోన్`2 పరిధిలో గల 24 డివిజన్లో ప్రతీ రోజూ లాగే చెత్తను ట్రాక్టర్లోకి లోడ్ చేసేందుకు వచ్చిన జవాన్ కుమార్, డ్రైవర్ ఇమామ్లకు చెత్త కుప్పలో బంగారు గొలుసు కనిపించింది. దీంతో వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్, సునీల్ కుమార్కు సమాచారం అందించారు. అదే సమయంలో గాయత్రి నగరుకు చెందిన పద్మగౌడ్ అనే మహిళ తన బంగారు గొలుసు ప పోయిందని ఏడ్చుకుంటూ చెత్త కుప్పల వద్దకు వచ్చింది. తన గోల్డ్ చైన్ పోయిందని, చెత్త వ్యానులు వెతకాలని శానిటరీ ఇన్స్పెక్టర్, అక్కడి కార్మికులను కోరగా గొలుసు దొరికిందని చెప్పారు. వివరాలు సరిగా కనుక్కొని అందరి ముందు 2తులాల మెడ గొలుసును ఆమెకు అందజేశారు. డ్రైవర్ ఇమామ్, జవాన్ కుమార్లను శానిటరీ ఇన్స్పెక్టర్ అభినందించారు.
చెత్తలో బంగారు గొలుసు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES