– పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్కరామస్వామి
నవతెలంగాణ – ఉప్పునుంతల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు తీసుకోవాలనే నిర్ణయంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం బడిబాట నిర్వహించుకోవడం తెలిసిన విషయమే. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఈ విద్యా సంవత్సరం ఎన్రోల్మెంట్ పెంచాలని నిర్ణయంలో భాగంగా ఆదివారం ఉప్పునుంతల మండలం పరిధిలోని యుపిఎస్ తాడుర్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలో కల్పించే సౌకర్యాల గురించి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్కరామస్వామి మాట్లాడారు. పాఠశాలలో ఉచిత దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ బుక్స్, ఉచిత మధ్యాహ్న భోజనం, ఏఐ తో విద్యా బోధన, కంప్యూటర్స్ తో సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు విద్యను డిజిటల్ పాఠాలు, శాస్త్రీయమైన అవగాహనతో విద్యార్థులకు చదువు నేర్పించడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సామాజిక పరివర్తన జరుగుతుందని అన్నారు. పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తుందని, సమాజంలో ఉన్న రుగ్మతలను అర్థం చేసుకొని వాటిని తొలగించుకుని ఒక ఉన్నతమైన మనిషిగా తయారవుతాడని, పాఠశాలలో గుణాత్మకమైన నైపుణ్యమైన విద్యను అందిస్తామని, ఇంటింటి ప్రచారంలో తల్లిదండ్రులకు, ప్రజలకు, విద్యాభిమానులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ప్రజా ప్రతినిధులు చంద్రయ్య, కృష్ణయ్య, తిరుపతయ్య, అశోక్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శివ, తిరుపతయ్య శెట్టి, ఉపాధ్యాయులు శ్యామల, శ్రీనివాసులు, వసంత కుమార్, గోపి, లక్ష్మీనారాయణ, కమల, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో విద్య మార్పులకు శుభారంభం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES