నవతెలంగాణ -తాడ్వాయి
మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 1995- 96 లో చదువుకున్న విద్యార్థుల ఆదివారం ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పూర్వ విద్యార్థులు వారి సొంత ఖర్చులతో ఆశ్రమ పాఠశాలలో “సరస్వతి” తల్లి విగ్రహాన్ని, గురువులతో కలిసి ఆవిష్కరించారు. దీనికి స్థానిక ప్రధానోపాధ్యాయులు కోటె రేవతి సభ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంతరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. 30 ఏళ్ళ తరువాత కూడా తమను గుర్తుంచుకొని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు ఎస్ వి ఎస్ టి భట్టాచార్య, ప్రకాశం, రఘు శర్మ, నరసింహా, దయాసాగర్, వాసుదేవా రెడ్డి, జ్యోతిర్మయి, కల్తీ లింగయ్య వార్డెన్ మోకాళ్ళ లక్ష్మి, ఈసం బుచ్చయ్య, నారాయణ, గొంది రామచందర్, దయానందరావు, సారంగపాణి, మరియు పూర్వపు విద్యార్థులు కొమరం ప్రభాకర్, తోలెం సమ్మయ్య, సాదు చక్రపాణి, మొగిలిపెల్లి రవీందర్, అల్లం జగ్గారావు, జవ్వాజి నీలం బాబు, ఇర్ప సూర్యనారాయణ, ఎల్లంకి సురేష్, 82 మంది పూర్వ విద్యార్థులు తదితరు పాల్గొన్నారు.