Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – భూపాలపల్లి: నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలోని శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాలలలో  2000- 2001 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం పట్టణంలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు  కుసుమ కృష్ణమోహన్, రాళ్ల బండి రాజేశం, బానోత్ రాజేందర్, ఆలూరి భాస్కర్, రాము, బాపూలకు పూర్వ విద్యార్థులు శాలువాలతో సన్మానించి మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల తిక్క ప్రవీణ్, సింగనవేణి చిరంజీవి, మిరియాల మహేందర్, వెన్నంపల్లి నాగరాజు, రాళ్ళబండి నిశాంత్, ఏకుల శీను, దుర్గాప్రసాద్, లలిత, కల్పన, లావణ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad