- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ పరిధిలో ని పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన కాటారం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్గా నియమితులైన పంతకాని తిరుమల సమయ్య గారిని కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఉన్నత పదవిలో కొనసాగుతూ అనేకులకు ఆశీర్వాద కారంగా ఉండాలని ప్రార్థన చేసి ఆశీర్వదించారు.
ఇట్టి కార్యక్రమంలో కాటారం డివిజన్ పాస్టర్ల ఫెలోషిప్ కమిటీ ప్రెసిడెంట్ పాస్టర్ డేవిడ్ మార్క్, ఉపాధ్యక్షుడు ఆదాము, జాయింట్ సెక్రటరీ ప్రకాష్ , ట్రెజరర్ ఆంగోత్ బన్సీలాల్ , సలహాదారులు ఐజాక్ , డానియెల్ ,రవీందర్ గారు, కోటేష్ , సామ్యూల్, తదితరులు కార్యక్రమం లో పాల్గొన్నాడం జరిగింది.
- Advertisement -