- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో గ్రామస్తులు మంగళవారం దుర్గామాతకు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు మంగళ హారతుల మధ్య బోనాలు నెత్తిన ఎత్తుకొని గ్రామంలో ర్యాలీ నిర్వహించి, అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
- Advertisement -