నవతెలంగాణ-రామగిరి : తెలంగాణ తొలి, మలి, చివరి దశ ఉద్యమకారులు నూనె రాజేశం ముదిరాజ్ ఆయన సతీమణి మలి దశ ఉద్యమకారిని నూనె మల్లేశ్వరికి ఘనంగా సన్మానం జరిగింది. జిల్లాలోని నందన గార్డెన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ జిల్లా ఉద్యమకారులకు ఘన సన్మానం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ తొలి, మలి చివరి దశ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్ అలాగే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమకారిని రామగిరి మండల అధ్యక్షురాలు నూనె మల్లేశ్వరిని శాలువాతో సన్మానించి, ప్రశంస పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ మాజీ జెడ్పిటిసి గోపగాని సారయ్య గౌడ్ నల్ల మనోహర్ రెడ్డి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు దొబ్బెడ చంద్రకళ, కొండ స్వామి, పాటల సురేందర్ రెడ్డి, దామ సదయ్య, కందుల సదాశివ్, బింగి రాజు, మంథని విజయకుమార్, గోగుల రాజ రెడ్డి, మంద భాస్కర్, బి శంకర్, అనంతరెడ్డి, వేల్పుల గట్టయ్య, కె శ్రీనివాస్, కవులు కళాకారులు తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES