నవతెలంగాణ – జుక్కల్
మండలంలొనీ ఖండేబల్లూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవలే ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం ప్రమోషన్లలలో భాగంగా పడంపల్లి ఎంపియుపిఎస్ ప్రభుత్వ పాఠశాల నుండి పదోన్నతి పొంది ఖండేబల్లూర్ జడ్.పి.హెచ్.ఎస్ కు వెళ్లడం జరిగింది. హెచ్ఎం బాలయ్య బాల్య మిత్రుడు అయినటువంటి శ్రీ ఎస్ లాలయ్య ను ఖండేబల్లూర్ జడ్పిహెచ్ఎస్ లో పీజీహెచ్ఎం గా పదోన్నతి వచ్చి నందుకు నేడు బిచ్కుంద హాస్టల్ లో చదివిన బాల్య మిత్రులందరు ఆనందోత్సవాల మధ్య ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాలయ్య ప్రణాళిక బద్ధమైన వ్యక్తి అని బాల్య మిత్రులు అన్నారు.
చదువుని చక్కగా ఆస్వాదించే వ్యక్తి విద్యను అందించడంలో ఆయనకు ఆయనే సాటి, ఆయనకు రారెవ్వరు పోటీ అని వక్తలు శ్రీ దస్థిరాం వైద్య బోధకులు అన్నారు. మట్టిలోని మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, నీటిలోని చేప పిల్లలు వెలికి తీయడంలో ఆయనే దిట్ట అని అన్నారు. ఆలస్యమైన విషం అమృతమైందని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ శాలువలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శ్రీ మారుతి పల్లెవార్ , పెద్ద ఎక్లార నాగయ్య హెచ్ఎం, సిబ్బంది ని కూడా సన్మానించుకున్న వారిలో ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో బాల్యమిత్రులు, గాలయ్య,గంగారాం,హెచ్.విట్టల్, సుభాష్, సీతారాం, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బాల్యమిత్రుడికి ఘన సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES