నవతెలంగాణ – భువనగిరి: వికలాంగుల హక్కుల కోసం, ఆత్మాభిమానం కోసం, అధిక పెన్షన్ కోసం గత 17 సంవత్సరాలుగా పోరాడుతున్న మంద కృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం “పద్మశ్రీ “అవార్డును ప్రకటించడంతో, హర్షం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగులు గురువారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ( వి.హెచ్ పి ఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ధరణీకోట నర్సింహ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు వికలాంగులు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ఎన్నికల్లో పోటీ చేసి ,రాజకీయ రంగంలో వికలాంగులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం వికలాంగులుకు సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సన్మాన కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు అనంతుల ఎల్లారెడ్డి , సింగం కరుణాకర్, సింగారం రమేష్, ఎర్ర వీరయ్య,లోడి ధనుంజయ,మచ్చ ఉపేందర్, ఇంజ పద్మ, కాటేపల్లి రజిత, పాక నాగరాణి పాల్గొన్నారు
మందకృష్ణకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES