- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు సొంత నిధులతో ఉచిత నోటుబుక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. ప్రతి ఏటా సామాజిక సేవలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకునేయడానికి ఉపాధ్యాయ బృందం అందరు కలిసి చర్చించుకుని ఒకటి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నోటుబుక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ఇది ప్రతి ఏటా చేస్తూ ఉంటామని పేర్కొన్నారు పంపిణీ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -