ఎస్ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నటించిన చిత్రం ‘గత వైభవం’. సునీ దర్శకత్వం వహించడమే కాకుండా, దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ ప్రాజెక్ట్కు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఫాంటసీ విజువల్ వండర్గా గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా విడుదలై, భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. సర్వేగర సిల్వర్ స్క్రీన్స్తో కలిసి సునీ సినిమాస్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్గా తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నేతత్వంలోని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని జనవరి 1న తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేయనుంది. ఇది న్యూ ఇయర్కి స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవనుంది. ఈ అనౌన్స్మెంట్ని ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్లో చూపించిననట్లుగా కథ నాలుగు విభిన్న కాలాలలో సాగుతుంది. కన్నడ వెర్షన్కు అద్భుతమైన స్పందన లభించడంతో, తెలుగు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి అని మేకర్స్ తెలిపారు.
తెలుగులోనూ హిట్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



