Saturday, October 4, 2025
E-PAPER
Homeసినిమాఈ తరానికి నచ్చే ప్రేమ కథ

ఈ తరానికి నచ్చే ప్రేమ కథ

- Advertisement -

అనురాధ దేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్‌ పతాకంపై తొలి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ విజయదశమి రోజు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
ఫిలింనగర్‌లోని సంస్థ కార్యాలయంలో దేవుడి పటాలపై తీసిన ముహూర్తపు షాట్‌కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్‌ ఆన్‌ చెయ్యగా, హీరో అభిరామ్‌ క్లాప్‌ ఇచ్చారు, సినిమా స్క్రిప్టును సమర్పకురాలు ఎన్‌.ఆర్‌.అనురాధాదేవి అందించారు. పూజ కార్యక్రమాన్ని ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించారు.

ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ దీపావళి తరువాత మొదలవుతుందని నిర్మాత అభిరామ్‌ రెడ్డి దాసరి చెప్పారు. ఈ సినిమా లవ్‌, థ్రిల్లర్‌గా రూపొందుతుందని, ఈ తరానికి నచ్చే కథతో నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగతా నటీనటులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: అభిరామ్‌ రెడ్డి దాసరి, ఛాయాగ్రహణం: విజయ భాస్కర్‌ సద్దాల, సహ దర్శకుడు: సాయి, సంగీతం: మంత్ర ఆనంద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నారాయణ రాజు ఎస్‌.బి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత: అభిరామ్‌ రెడ్డి దాసరి. ఇంకా పేరు నిర్ణయించని ఈ ప్రేమ కథా చిత్రాన్ని సీనియర్‌ నిర్మాత అనురాధా దేవి సమర్పిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -