Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారంలో మాస్టర్‌ ప్లాన్‌..

మేడారంలో మాస్టర్‌ ప్లాన్‌..

- Advertisement -

– అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
– నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క
నవతెలంగాణ-తాడ్వాయి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరగబోయే సమ్మక్క-సారలమ్మ గిరిజన మహా జాతరకు వచ్చే సందర్శకులు అమ్మవార్ల గద్దెలను సునాయాసంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకునే విధంగా చేపట్టిన మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్‌ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను, జంపన్న వాగు వద్ద పనులను మంత్రులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, ములుగు డీఎస్పీ రవీందర్‌, ములుగు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్‌, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ భానోత్‌ రవిచందర్‌, ములుగు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, ఆర్‌అండ్‌బీ, ఈఎన్‌సీ మోహన్‌ నాయక్‌, ఇంజనీరింగ్‌, పోలీస్‌, వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -