Thursday, June 12, 2025
E-PAPER
Homeజిల్లాలుఫీజుల దోపిడీపై విద్యాసంస్థలతో సమావేశం నిర్వహించాలి

ఫీజుల దోపిడీపై విద్యాసంస్థలతో సమావేశం నిర్వహించాలి

- Advertisement -

ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ఫీజుల దోపిడీపై డిస్టిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ప్రైవేట్ విద్యాసంస్థలతో సమావేశం నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి. దినేష్ పాల్గొని మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 750 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి కానీ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పట్టించుకోవడంలేదని అన్నారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని దానిపై డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుందని అందులో సభ్యులుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఉంటారని వెంటనే దృష్టికి రెగ్యులేషన్ కమిటీ ప్రవేటు పాఠశాలలతో సమావేశం నిర్వహించి ఫీజుల దోపిడికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో గవర్నమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను పెంచాలి తప్ప అనేక పాఠశాలలో ఈ అంశాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగం సేవారంగం తప్ప వ్యాపార రంగం కాదని గుర్తు చేశారు. మరియు డొనేషన్ల పేరుతో క్యాపిటేషన్ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తున్నారని అన్నారు. మరియు ప్రభుత్వం సిఫారసు చేసిన పాఠ్యపుస్తకాలనే అమ్మాలని ధరలను అదుపులో ఉంచాలని అన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అజాద్, నగర సహాయ కార్యదర్శి అభి, నాయకులు గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -