Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుమారుని పెండ్లికి రావాలని ఇంటికో చీర అందజేత

కుమారుని పెండ్లికి రావాలని ఇంటికో చీర అందజేత

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
జనగామ గ్రామంలో ప్రతి ఇంటికి వివాహ పత్రికతో పాటు చీరను అందజేశారు. బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత తిమ్మయ్య గారి రజని – సుభాష్ రెడ్డి ల కుమారుడు నిహాంత్ రెడ్డి – హర్షిత వివాహము నవంబర్ 7   హైదరాబాదులోనీ శంషాబాద్లో జరిగే వివాహ పత్రికను జనగామ గ్రామంలో ఆదివారం ఇంటింటికి అందజేశారు. వివాహ పత్రికతో పాటు చీరలను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, సైదు గారి అశోక్ గౌడ్, జీవన్ రెడ్డి,  సిద్ధ రామ్ రెడ్డి, బోదాసు సాయి, నీల స్వామి, అంకన్నగారి సుమన్ గౌడ్,  పాత స్వామి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -