Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవి విరమణ చేసిన సిబ్బందికి ఘన వీడ్కోలు

పదవి విరమణ చేసిన సిబ్బందికి ఘన వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ శాఖలో ఆగస్టు 31న పదవి విరమణ కార్యక్రమం శనివారం నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఆగస్టు నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డి.ఎల్లయ్య గౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ,వి.ఆర్, నిజామాబాద్ పోలీస్ శాఖలో (43) సం|| ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. టి. నర్సింలు ,సబ్ ఇన్స్పెక్టర్ , సి.సి.ఆర్.బి నిజామాబాద్ పోలీస్ శాఖలో (42) సం|| ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు. ఎల్.యాకుబ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్: 855, టాస్క్ ఫోర్స్, నిజామాబాద్ పోలీస్ శాఖలో ( 33 ) సం|| ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. వీరికి శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి, ఎలాంటిరిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటలు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు, మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లుసందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్,  తిరుపతి, ఆఫీస్ సూపర్డెంట్ లుశ్రీ శంకర్,  బషీర్ అహ్మద్,మరియు షకీల్ పాషా, పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -