స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరికి శివసేన ధన్యవాదాలు
హైదరాబాద్ : గ్రామీణ క్రీడాకారులకు మేలు చేసేలా నూతన క్రీడా విధానాన్ని రూపొందించి, బాధ్యతలు స్వీకరించిన తొలి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపేలా కృషి చేసిన క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ కే. శివసేన రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం సచివాలయంలోని కార్యాలయంలో పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరిని శివసేన రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కప్లో చాంపియన్లుగా నిలిచిన గ్రామీణ క్రీడాకారులు సైతం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ రిజర్వేషన్ పొందేలా స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేశామని.. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన అథ్లెట్లకు భారీ నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి శ్రీహరి ఈ సందర్భంగా అన్నారు.
అథ్లెట్లకు మేలు చేసే స్పోర్ట్స్ పాలసీ
- Advertisement -
- Advertisement -