- Advertisement -
నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన షామకూరి నీరజ్ ఇటీవల వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ విద్యార్థుల కవితా పోటీల్లో ప్రధమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ రామ్ దాస్, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సాధించాలని తెలిపారు.
- Advertisement -



