గుడి గుడికో జమ్మి చెట్టు..
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని బిఆర్ఎస్ ఆద్వర్యంలో శుక్రవారం మండలంలో ప్రసిద్ధి గాంచిన అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ అడెల్లి పోచమ్మ చైర్మన్ సింగం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన మహా కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కో అడినేటర్ భోజనారాయణ, నిర్మల్ జిల్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంచార్జ్ అశోక్ రాథోడ్,ఎం లక్ష్మణ్, సతీష్ గౌడ్, ప్రశాంత్ రాజేశ్వర్,, ఏం విట్టల్ , నాయిక రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
ఊరు ఊరికో జమ్మి చెట్టు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES