- Advertisement -
-పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు
నవతెలంగాణ – బెజ్జంకి : నేడు నాటిన మొక్కలు..భవిత్యత్తు తరాలకు ఊపిరినిస్తాయని..తల్లిదండ్రుల పేరున ప్రతి ఒక్కరూ మొక్కను నాటి సంరక్షించాలని పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు ప్రజలకు సూచించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ తన్నీరు శరత్ రావు సభ్యులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పీఏసీఎస్ సీఈఓ వాసు, సిబ్బంది బుచ్చయ్య, అనిల్, మల్లేశం, స్థానికులు బొల్లం శ్రీధర్, గుభిరే మల్లేశం తదితరులు హజరయ్యారు.
- Advertisement -