- Advertisement -
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం సురవరం సుధాకర్ రెడ్డి భౌతికఖాయం వద్ద నివాళులు అర్పించారు. హైదరాబాద్ హిమయత్ నగర్ లో మఖ్దుమ్ భవన్ లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయం వద్ద వారు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిబద్ధతతో పనిచేసే నాయకులు కొందరే ఉంటారని అలాంటి నిబద్ధతగల నాయకులలో ఒకడైన సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు.
- Advertisement -