- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిధిలోని పివినగర్ అటవీప్రాంతంలో మానేరు ప్రక్కనున్న పురాతనమైన ఆలయాలైన నైన గుళ్లలోని రామలింగేశ్వర స్వామికి ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తిరుగువార అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ అభిషేక మహోత్సవానికి హాజరైన సందర్శకులకు కొంరోజు లక్ష్మీ-శ్రీనివాస్ దంపతులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అయిత జెడ్పిటిసి కోమల-రాజిరెడ్డి,గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



