Sunday, October 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అధికారి

ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అధికారి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కోఆపరేటివ్ అధికారి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జి అధికారి రాథోడ్ బిక్కు నాయక్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ ఉద్యోగికి పెరిగిన వేతనాల మంజూరు, సస్పెన్షన్ ఎత్తివేత కోసం రూ.7 లక్షలు డిమాండ్ చేసి.. చివరికి రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. శనివారం ఉదయం డీసీవో నివాసంలో రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -