- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ శ్రావణ్ ఇంట్లో ఏసీబీ మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



