Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ

జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి  : నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి జక్రన్ పల్లి పోలీస్ స్టేషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారని ఎస్సై మాలిక్ రెహ్మన్ తెలిపారు. సందర్భంగా ఏసీపీ పలు అంశాలపై సమీక్ష నిర్వహించి, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. స్టేషన్ పనితీరు సమీక్ష, రిసెప్షన్, కంప్యూటర్ సిబ్బంది పనితీరు పరిశీలన 5S విధానం అమలుపై సమీక్షపోలీస్ వాహనాల పార్కింగ్ పరిస్థితుల పరిశీల, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం పటిష్ట చర్యల చేపట్టాలని అన్నారు. సైబర్ మోసాలు, గేమింగ్ యాప్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్టేషన్ సిబ్బంది సమస్యల పరిష్కారం గురించి సూచనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -