నవతెలంగాణ – కంఠేశ్వర్ : ప్రయివేట్ పాఠశాలలతో కుమ్మక్కై పుస్తకాలను అమ్ముతున్న బుక్ స్టాల్స్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కి ప్రయివేట్ విద్యాసంస్థల పుస్తకాలను బుక్ స్టాల్స్ లో స్టోర్ చేసి అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్స్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విజయ హై స్కూల్ సంబంధించి పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు ఒకే ఒక్క ఇంగ్లీష్ పుస్తకానికి 800 వందల రూపాయలు పెట్టి అమ్ముతున్నారని ఆన్నారు. మొత్తం పుస్తకాలకు 3000 నుండి 5వేల వరకు విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రయివేట్ బుక్ స్టాల్స్ ని సర్వేలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర అధ్యక్షులు ఆజాద్, జిల్లా కమిటీ సభ్యులు రాజు, అభినయ్ అభినయ్, గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
బుక్ స్టాల్స్ పై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES