Monday, June 2, 2025
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణలో నకిలీ బీటెక్ యూనివర్శీటీలపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ

తెలంగాణలో నకిలీ బీటెక్ యూనివర్శీటీలపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అందించే పేరుతో నకిలీ బిటెక్ యూనివర్శీటీలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఒక సంవత్సరానికి లక్షలు రూపాయలు తీసుకుని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఈ నకిలీ యూనివర్శీటీలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాని డిమాండ్ చేస్తోంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్, శ్రీమాన్, స్టాలిన్ లతో కలిసి నాగరాజు మాట్లాడారు.

రాష్ట్రంలో నెక్ట్స్ వేవ్ ఇన్సీస్టూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఎన్ఐఎటి), నానక్ రామ్ గూడ,లిఫ్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫైనాన్స్ డిస్ట్రిక్ లలో ప్రైవేటు అపార్ట్మెంట్స్ తీసుకుని ఐఐటీలో లేదా ఎన్.ఐ.టి.లలో అడ్మిషన్లు రాకపోయిన ఐ.ఐ.టి లాగ, ఎన్.ఐ.టి.స్థాయిలో సి.ఎస్.ఈ.( ఆర్టీఫిషియల్, మెషిన్ లెర్నింగ్), సైబర్ సెక్యూరిటి కోర్సుల పేరుతో అడ్మిషన్లు తీసుకుని తరగతులు నడుపుతున్నారు. యూ.జి.సి ,ఎ.ఐ.సి.ఈ.టి. అనుమతులు లేకుండా క్యాంపస్ ప్రారంభించి ,విద్యార్థులను చేర్పించుకోని భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు.

ప్రైవేటు డిమ్డ్ యూనివర్శీటీలతో ఎం.ఓ.యు.( మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్)ఉందనే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం గాని, ఉన్నత విద్యామండలి చైర్మన్ స్పందించడం లేదు.

కనీసం తల్లిదండ్రులు అవగాహన కోసం నకిలీ యూనివర్శీటీలు పేర్లు ప్రకటించి, చేరోద్దని ప్రకటనలు చేయాలి. కానీ అడ్మిషన్లు పూర్తిగా నింపుతున్న సరే ఉన్నత విద్యామండలి స్పందించడం లేదంటే వారికి ఏమి ముట్టిందో చెప్పాలని అన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి నకిలీ యూనివర్శీటీలు వచ్చి వందల కోట్లు కొలగోడుతున్న ఎందుకు ముఖ్యమంత్రి స్పందించడం లేదో సమాధానం చెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ సీట్లు నింపకముందే బి కేటగిరీ సిట్లను డోనేషన్లు లక్షలాది రూపాయలు తీసుకుని అమ్ముకుంటున్నారని వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని డోనేషన్లు వసూళ్లు చేస్తున్న కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని ,ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో అధిక ఫీజులు తీసుకుంటున్న కళాశాలపై టాస్క్ఫోర్స్ కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -