నవతెలంగాణ – భిక్కనూర్
అనుమతి లేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టీజీవీబీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఎండి సమీర్ ఖాన్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో పాఠశాలలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి పాఠశాలలు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు వసతులు, సౌకర్యాలు, నిబంధనలకు లోబడి ఫీజుల వసూళ్లు, పుస్తకాల అమ్మకాలు వంటివి తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ యోగేష్, టౌన్ ప్రెసిడెంట్ నరేందర్, భాను, ప్రకాష్, తదితరులు ఉన్నారు.
అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: టీజీవిపి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES