Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్..
నవతెలంగాణ – కంఠేశ్వర్ : బిల్డింగ్ పర్మిషన్ లేని కార్పొరేట్ శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. బిల్డింగ్ పర్మిషన్ లేని ప్రైవేట్ కార్పోరేట్ విద్యాసంస్థల అయినటువంటి శ్రీ చైతన్య నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీబీఎస్ఈ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రయివేటు పాఠశాలలో అడ్మిషన్ల పేరుతో ఫీజుల పేరుతో అక్షరాలను అడ్డుగా పెట్టి లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీకి చైర్మన్ గా జిల్లా విద్యాశాఖ అధికారి సభ్యులుగా ఉన్నారని వెంటనే ఫీజుల పైన సమావేశం ఏర్పాటుచేసి అధిక ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిర్ణయం చేయాలని అన్నారు. అదేవిధంగా విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలకు నిలయంగా మారాయని వెంటనే వెంటనే సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, జిల్లా నాయకులు రాజు, విశాల్ , తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -