Thursday, June 26, 2025
E-PAPER
Homeఖమ్మంవంద్యత్వ మొక్కల గుర్తింపుకు కార్యాచరణ..

వంద్యత్వ మొక్కల గుర్తింపుకు కార్యాచరణ..

- Advertisement -

పరిశోధనా, పరిష్కారం నిరంతరం…
ఐఐఓపీఆర్ఐ ప్రిన్సిపుల్ సైంటిస్ట్ ఎంవీ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పామాయిల్ సాగులో ఎదురవుతున్న సవాళ్ళు,వంద్యత్వ మొక్కలు గుర్తింపుకు,పరిశోధన,పరిష్కారం అనేవి నిరంతరం ప్రక్రియ అని ఐఐఓపీఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫాం రీసెర్చ్) పెదవేగి ప్రిన్సిపుల్ సైంటిస్ట్ ఎంవీ ప్రసాద్ అన్నారు.

పామాయిల్ సాగులో వంద్యత్వ మొక్కలు గుర్తించి,శోధించి,పరిష్కారం కనుగొనాలని ఎస్టీ కమీషన్ జారీ చేసిన ఆదేశాలు మేరకు ఆయన గురువారం మండలంలోని కుంచం సుబ్బారావు,నున్నా క్రిష్ణ,ఆళ్ళ నాగేశ్వరరావు పామాయిల్ క్షేత్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

మొక్క నాటే ముందు మృత్తికా పరీక్షలు నిర్వహించాలా?అంతర పంటలు ఏమేమి సాగు చేసారు?నీటి తడులు ఎలా ఇస్తున్నారు?ఏమేమి ఎరువులు ఎంతెంత మోతాదులో ఇస్తున్నారు?ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? అంశాలను నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా వంద్యత్వ లేక ఎదుగుదల లేని లేక నాసిరకం మొక్కలు గుర్తించే ప్రక్రియ చేపడతామని,అనంతరం ఒక్కో మొక్కను పరిశీలించి శాస్త్రీయంగా ఆ మొక్కకు చీడపీడలు,ఎదుగుదల లేకపోవడానికి కారణాలు,గెలలు దిగుబడి రాకపోవడానికి లేక గెలలు రాకపోవడానికి వంద్యత్వ మా లేక మరేదైనా కారణమా అనేది పరిశోధించి ఎస్టీ కమీషన్ కు నివేదిక అందిస్తామని అన్నారు.

ఆయన వెంట మరో ఇరువురు శాస్త్రవేత్తలు రామచంద్రుడు,బి.కళ్యాణ్,హెచ్ ఆర్ఎస్ సైంటిస్ట్ ఆండ్ హెడ్ విజయ్ క్రిష్ణ,ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ ఏ.కిరణ్,జిల్లా ఇంచార్జి రాధాక్రిష్ణ,ఉద్యాన శాఖ అశ్వారావుపేట,దమ్మపేట అధికారులు వేణుమాధవ్,సందీప్,ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ అద్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వరరెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -