Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అదనపు  కలెక్టర్..

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అదనపు  కలెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం రోజు  మోత్కూర్ మున్సిపాలిటీలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను  స్థానిక సంస్థ ల జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వార్డు ఆఫీసర్స్ ప్రతి రోజు వార్డులలో పర్యటించి వార్డు ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికి అప్పుడు పరిష్కారం చేయవలిసినదిగా సూచనలు చేయడం జరిగింది.బిల్ కలెక్టర్ మరియు వార్డు ఆఫీసర్స్ సమన్వయం చేసుకుంటూ కలిసి వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండవలిసినదిగా ఆదేశించడం జరిగింది.

వార్డులలో నీటి సమస్య, లైట్స్, చెత్త ట్రాక్టర్ 2 రోజులకు ఒకసారి వచ్చే విధముగా చూడాలి అని చెప్పడం జరిగింది.సిబ్బంది యొక్క హాజరు రిజిస్టర్ పరిశీలించి చాలా మంది సిబ్బంది రిజిస్టర్ సంతకం చేయకుండా ఉంటే వారికి షోకాజ్ నోటిస్ ఇవ్వమని కమిషనర్ ని చెప్పడం జరిగిందన్నారు.  మున్సిపాలిటీ సమస్యల గురించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కమీషనర్ ఫోన్ నెంబర్ ఇవ్వాలని , సమస్యలు పరిష్కారం కానిచో నేరుగా అదనపు కలెక్టర్ కి ఫోన్   కి కూడా  చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్  సతీష్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -