- Advertisement -
నవతెలంగాణ – భూపాలపల్లి
యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, భూపాలపల్లి మండల కన్వీనర్ ముత్తోజు వేణాచారి, మొగుళ్ళపల్లి మండల కన్వీనర్ బండారు కుమార్ యాదవ్, జిల్లా కమిటీ సభ్యులు గాదం పోశయ్య, చొప్పరి రాజయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.
- Advertisement -



