Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హంగర్గాలో పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ

హంగర్గాలో పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగర్గా గ్రామంలో ఏ ఈ ఓ నాందేవ్  గ్రామ రైతులతో కలిసి బుధవారం ప్రత్తి పంట ను క్షేత్రస్థాయి లోకి వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా  ప్రత్తి పంటలో తెల్ల దోమ, పచ్చ దోమ, పెను బంక రసం పీల్చే  పురుగులను  గమనించడం జరిగింది. రసం పీల్చే పురుగల ఉదృతిని బట్టి  అసె్ఫేట్ ఇమిడక్లోప్రిడ్  400 గ్రా / ఎకరానికి  లేదా ఫ్లోనికామిడ్ డఫెంతిరాన్ 250  గ్రా/ ఎకరానికి , రసాయన మందులు పిచికారీ చేయాలని రైతులకు సూచించడం జరిగింది. పంటలను కాపాడుకోవడానికి రసాయన ఎరువులు వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలని తెలిపారు. 

రసాయన ఎరువులు మోతాదులో ఉపయోగించాలని రైతులకు వివరించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పంటలకు అనుకున్న స్థాయిలో వర్షం లేక పోవడంతో కీటకాల అభివృద్ధి ఉధృతి పెరుగిందని సూచించారు. ఈ కార్యక్రమం లొ రైతులు శివాజీ, విజకుమార్, మరియు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -