- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని కరక్ వాడి గ్రామానికి చెందిన దొడ్లి భాస్కర్ కుమారుడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన అగ్ని వీర్ జనరల్ డ్యూటీకి ఎంపికయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రామ్ అగ్నివీర్ కు ఎంపిక కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో ఇతను రెండో ప్రభుత్వ ఉద్యోగి అని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -