- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ పాలెపు నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మెర్సీ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భూత్ పురం మహిపాల్, జీవన్, లక్మ రంజిత్, చిన్న బాబన్న, కోరిపెల్లి లింగారెడ్డి, నవీద్, రాములు, ముత్తెన్న, సూపర్ వైజర్ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


