Friday, November 28, 2025
E-PAPER
Homeఖమ్మంకేరళ లో పర్యటిస్తున్న వ్యవసాయ విద్యార్ధులు

కేరళ లో పర్యటిస్తున్న వ్యవసాయ విద్యార్ధులు

- Advertisement -

– సీసీ ఆర్ఐ సందర్శన 
నవతెలంగాణ-అశ్వారావుపేట

ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఈ నెల 23 వ తేదీ నుండి డిసెంబర్ 3 వ తేదీ వరకు పదిరోజులు పాటు చేపట్టిన దక్షిణ భారత విజ్ఞాన యాత్రలో భాగంగా 6 రోజు శుక్రవారం కేరళ,అల్లెపీ జిల్లా, అల్లపజా మండలం కావలూరు లోని సీసీ ఆర్ఐ (సెంట్రల్ కాయిర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – కేంద్రీయ కొబ్బరి పీచు పరిశోధనా సంస్థ)  ను సందర్శించారు. అందులో తయారవుతున్న  కొబ్బరి ఉప ఉత్పత్తులు,ప్రయోజనాలు పై అధ్యయనం చేసారు. 102 మంది విద్యార్థులు పాల్గొనే ఈ విజ్ఞాన యాత్రకు టూర్ లీడర్లు గా స్థానిక వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ టీ. శ్రావణ కుమార్, డాక్టర్ కే.శిరీష్, డాక్టర్ శ్రీ జన్, స్రవంతి లు వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -