Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించాలి..

వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించాలి..

- Advertisement -

జిల్లా వ్యవసాయ అధికారి  గోపాల్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: భువనగిరి  మండలంలోని వీరవెల్లి గ్రామంలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను కార్యక్రమాన్ని ఏరువాక కేంద్రం , యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా  జిల్లా వ్యవసాయాధికారి  గోపాల్ హాజరై మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం జిల్లా వ్యాప్తంగా విస్తరించాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల పెట్టుబడులు తగ్గి అధిక ఆదాయం పొందడమేగాక కూలీల కొరత తీరుతుందన్నారు. పంటల సాగులో నాన్యమైన  విత్తన వినియోగము, తగిన మొతాదులో ఎరువుల ,పురుగు మందుల వాడకం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా 6 అంశాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్ వివరించారు. అనవసర అధిక , వినియోగాన్ని తగ్గించి, సాగు ఖర్చును తగ్గించుట, అవసరం మేరకే రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, విక్రయ కేంద్రాల్లోని రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందడం,  సాగునీటిని ఆదా చేసి, భావితరాలకు అందించడం, పంట మార్పిడి  పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు.  చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడటం అన్నారు.జిల్లా ఉద్యాన , పట్టు పరిశ్రమ శాఖాధికారి సుభాషిణి  పండ్ల తోటలు , కురగాయలు, పూలతోటలు , పామాయిల్ సాగులో సబ్సిడీల గురించి, సాగు మెలకువలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బి. అనిల్ కుమార్, బి రాజా మధుశేఖర్, భూగర్భ నీటి విభాగం ఇంజనీర్ అశ్విత్, మండల వ్యవసాయ అధికారి మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, ఉపాధ్యాయులు , మాజి సర్పంచ్ శ్రీనివాస చారి, మాజి ఎంపీటీసీ కంచి   లలిత , అభ్యుదయ రైతులు కంచె మల్లయ్య, సురవరం  చంద్రశేఖర్ రెడ్డి, రేగు శ్రీశైలం , రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -