నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఐద్వా ఆధ్వర్యంలో రేషన్ షాప్ లో సర్వే శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ.. మూడు నెలల రేషన్ ఒకేసారి పొయ్యడం ద్వారా రేషన్ షాప్ డీలర్ల ఇబ్బందిని పరిశీలించారు. రేషన్ తీసుకుంటున్న ప్రజల ఇబ్బంది గమనించారు. మూడు నెలల రేషన్ ఒకటేసారి పోయడం వల్ల మూడుసార్లు తంబింగ్ ఇవ్వడం, అందులో ఇంకో కొత్త మెలిక పెట్టడం జరిగింది. అదేంటంటే కేంద్ర కమిటీ ఇస్తున్న కిలో బియ్యాన్ని కూడా సపరేట్గా కొలిసివ్వాలనేది రూల్. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డీలర్లు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం సపరేట్గా కొలిసి ఇచ్చిన సందర్భాలు గతంలో లేవు. దానివల్ల కొన్ని సందర్భాల్లో సర్వే సరిగ్గా రాక తమ్మింగ్ లేట్ అయి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇదే సందర్భంలో నే ఒంటరి మహిళలకు అంత్యోదయ కార్డు ఉండడం వల్ల ఇక్కడ కాదు ఇంకోచోట అని ఒంటరి మహిళలు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ల చెబుతున్నారు. దాంట్లో వృద్ధులు చాలామంది ఉన్నారు కాబట్టే ఒంటరి మహిళలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా బియ్యం ఇవ్వాలి. అలాగే తమ్మింగ్ సిస్టంలో ఒకసారి తమ్మింగ్ ఇస్తే మూడు నెలల రేషన్ ఇచ్చేటట్టు చూడాలి. ఏదైతే బయోమెట్రిక్ కి బ్లూటూత్ కనెక్ట్ లో కనెక్షన్ తీసేస్తే మాకు బియ్యం పోయడం త్వరగా అవుతుందని ప్రజలు చెబుతున్నారు.
డీలర్లు చెప్తా ఉన్నారు అలాగే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడిగా పుల్ల కాస్తున్నటువంటి ప్రజలకు కనీసం మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే రేషన్ షాప్ ల వద్ద నీరసంతో పడిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే మూడు నెలల రేషన్ వర్షాకాలం అని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కాకూడదు అని మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో మూడు నెలల పాటు కనీసం చేతినిండా పని లేక అనేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఏదైతే కేరళ రాష్ట్రంలో నిత్యవసర సరుకులు 14 రకాలు రేషన్ షాప్ లలో ఇస్తున్నారో అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేయాలని ఐద్వా డిమాండ్ చేస్తుంది. లేదంటే రానున్న కాలంలో రేషన్ షాపులో నిత్యవసర సరుకులు 14 రకాలు ఇచ్చే అంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.