Saturday, June 14, 2025
E-PAPER
Homeబీజినెస్కుప్పకూలిన విమానయాన షేర్లు

కుప్పకూలిన విమానయాన షేర్లు

- Advertisement -

– ఎయిరిండియా దుర్ఘటనతో ఒత్తిడి
– సెన్సెక్స్‌ భారీ పతనం
ముంబయి:
అహ్మాదాబాద్‌ లో ఎయిరిండియా ఘోర ప్రమాదంతో గురువారం విమాన యాన రంగ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొ న్నాయి. అమెరికాకు చెందిన విమానాల తయారీ కంపెనీ బోయింగ్‌ కో షేర్‌ ఇంట్రాడేలో ఏకంగా 8 శాతం పతనమయ్యింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్‌ విలువ 3.32 శాతం లేదా రూ.187 పతనమై రూ.5,444కు తగ్గింది. ఇంట్రాడేలో 5,418 కనిష్టాన్ని తాకింది. స్పైస్‌జెట్‌ షేరు విలువ 1.78 శాతం నష్ఠంతో రూ.44.68 వద్ద ముగిసింది. అమెరికా ప్రీ మార్కెట్‌లో బోయింగ్‌ షేర్‌ 5.83 శాతం క్షీణించి 214 డాలర్లుగా నమోదయ్యింది.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 823 పాయింట్లు లేదా 1 శాతం క్షీణించి 81,691.98కి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 253 పాయింట్లు లేదా 1.01 శాతం నష్టంతో 24,888 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఏకంగా 1000 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 24,900 దిగువన ట్రేడింగ్‌ అయ్యింది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్‌, టెక్‌ మహీంద్రా షేర్లు మాత్రమే లాభ పడ్డాయి. టాటా మోటార్స్‌, టైటాన్‌, ఎటర్నల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఐటీసీ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -