- Advertisement -
నియామక పత్రాన్ని అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు సంపత్
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రజక సంఘం జిల్లా అధ్యక్షుడుగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఐత బాపును ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా రాష్ట్ర అధ్యక్షుడు పుసాల సంపత్ తెలిపారు. బుధవారం ఐత బాపుకు నియమక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐత బాపు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడుకి బాపు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం పటిష్టతకు, రజకుల సమస్యలపై తనవంతుగా పోరాటం చేస్తామన్నారు.
- Advertisement -



