Wednesday, June 18, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్గ్రామీణ ప్రాంత ప్రజలకు అలర్ట్..

గ్రామీణ ప్రాంత ప్రజలకు అలర్ట్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నంబర్ లో మార్పులు చేసింది. మిషన్ భగీరథ విభాగం గ్రామీణ ప్రజల తాగునీటి సమస్య ఫిర్యాదులను నమోదు చేసుకొవడానికి ప్రస్తుతం ఉన్న 1800-599-4007 (11-అంకెల) టోల్ ఫ్రీ నంబర్ కు బదులుగా నాలుగు అంకెల 1916 (4-అంకెల) నంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీత‌క్క ఆదేశాల మేర‌కు అధికారులు ఈ మార్పులు చేశారు. ప్రజలకు సులువుగా గుర్తుండేలా ఈ నూతన నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నాలుగు అంకెల 1916 టోల్ ఫ్రీ నంబర్ తో ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా తమ తాగునీటి సమస్య ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి మంచి నీటిసరఫరా విషయంలో ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం 11 నంబర్లతో కూడిన టోల్ ఫ్రీ నంబర్ ను గతేడాది అందుబాటులోకి తీసువచ్చింది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ ను హైదరాబాద్ మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసి 24/7 పని చేసేలా చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి టోల్ ఫ్రీ ద్వారా వ‌చ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ సిబ్బంది పరిష్కరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -