Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టులందరికీ శిక్షణ ఇవ్వాలి

జర్నలిస్టులందరికీ శిక్షణ ఇవ్వాలి

- Advertisement -

విభజన సరికాదు
పౌరసంబంధాల శాఖ కమిషనర్‌కు ఫెడరేషన్‌ వినతి
కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా తరగతుల్లో జర్నలిస్టులందరికీ అవకాశం కల్పించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఏదో ఒక సంఘానికి సంబంధించిన జర్నలిస్టులకు కాకుండా అన్నీ సంఘాల్లో సభ్యులుగా ఉండే విలేకర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్యతోపాటు ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్‌, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్‌, బి.జగదీష్‌ కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో తమ సంఘంలో సభ్యత్వం తీసుకుంటేనే మీడియా అకాడమీ శిక్షణలో అవకాశమిస్తామని ఒక సంఘం చెప్పడాన్ని ఫెడరేషన్‌ నాయకులు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులకు అందుబాటులో ఉండేలా శిక్షణ ప్రాంతాన్ని ఎంపిక చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌ రూపొందించి జర్నలిస్టుల స్కిల్‌ పెరిగేలా మీడియా అకాడమీ కృషి చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల్లో విభజన చేయకూడదన్నారు. అలాగే జూన్‌ 30తో జర్నలిస్టుల అక్రిడిటేషన్ల రెన్యువల్‌ గడువు ముగుస్తుందనీ, మరోసారి స్టిక్కర్లు వేయకుండా కొత్త అక్రిడిటేషన్లను జారీచేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. ఇందుకు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ హరీష్‌ స్పందించి వెంటనే మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్‌రావుకు కాల్‌ చేసి’ శిక్షణా తరగతుల్లో జర్నలిస్టులందరికీ అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. సంఘాలతో సంబంధం లేకుండా నిబంధనల ప్రకారం శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -