Monday, June 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్ల నీటి సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: జూలకంటి

బనకచర్ల నీటి సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: జూలకంటి

- Advertisement -


*స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలి
*పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి
*యుద్దాలు వద్దు…శాంతిని నెలకొల్పాలి
నవతెలంగాణ మిర్యాలగూడ

బనకచర్ల నీటి సమస్యపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని యాద్గార్పల్లి ఎస్ఎన్డి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న నియోజక వర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నీటి జలాలపై అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన బనకచర్ల పై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. స్థానిక సంస్థల ప్రభుత్వాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని ఆరోపించారు. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర నిధులు రావటం లేదన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్ కొనసాగుతున్నందున గాదులకు అవసరమైన ఎరువులు విత్తనాలు కల్తీ లేకుండా ఉండేలా చూడాలని సూచించారు.

నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందించాలని కోరారు. పెండింగ్లో రైతుభరోసా, రైతు రుణ మాఫీ వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేదలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. రాజకీయ గతీతంగా అర్హులైన పేదలందరికీ పథకాలు అందించాలని సూచించారు. ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు జరగడం వలన ప్రజలపై భవిష్యత్తులో భారాలు పడే అవకాశం ఉందన్నారు. యుద్ధాలు ఆపాలని, శాంతిని నెలకొల్పాలని, చర్చల ద్వారా పరిష్కార మార్గం చూపాలని సూచించారు.

సరళీకృత ఆర్థిక విధానాల అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి వివరించారు. సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, ప్రిన్సిపాల్ వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ వన్టౌన్ టు టౌన్ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, బావాండ్ల పాండు, మండల కార్యదర్శలు రవి నాయక్, వినోద్ నాయక్ శశిధర్ రెడ్డి, రొండి శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు చౌగాని సీతారాములు, అయూబ్, సీనియర్ నాయకురాలు గాదె పద్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -