- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలోని శిథిల అవస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి పునరావస్తు ప్రదేశాలకు తరలించాలని మండల రెవెన్యూ అధికారి బిక్షపతి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండలంలోని ప్రతి పంచాయతీ కార్యదర్శి వారి వారి గ్రామాలలోనే ఉండి స్థానికంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మండల రెవెన్యూ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి నీటిని వదులుతున్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కాలువ పరిసరాలలోకి ఎవరు వెళ్లకూడదని ఆయన సూచించారు.
- Advertisement -