.
ఐఎస్ఎస్తో అనుసంథానమైన డ్రాగన్
ఐఎస్ఎస్లోకి ప్రవేశించిన తొలి భారతీయుడిగా
శుభాంశుశుక్లా రికార్డు
అంతరిక్షం నుంచి లైవ్ కాల్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా గురువారం రికార్డు సృష్టించారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా బుధవారం శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములను తీసుకుని వెళ్ళిన డ్రాగన్ అంతరిక్ష నౌక భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.01 గంటలకు అంతరిక్ష కేంద్రంతో అనుసంథానమైంది. 4.15 గంటలకు మొత్తంగా డాకింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ తర్వాత కాసేపటికి నలుగురు వ్యోమగాములు స్టేషన్ లోకి చేరుకున్నారు. పరస్పర కరచాలనాలు, ఆలింగనాలతో అక్కడ కాసేపు సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఇక ప్రయోగాలకు సర్వం సిద్ధమైనట్లైంది.
చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నా
అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళడానికి ముందుగానే శుక్లా అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడారు. ‘ప్రజలకు రోదసీ నుండి నమస్కారం’ అని శుక్లా చెప్పారు. భారరహిత స్థితిలో ఎలా జీవించాలో చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఈ శూన్యంలో ఇలా తేలియాడుతూ వుండడం అద్భుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తోటి వ్యోమగాములతో ఇలా కలిసి వుండడం ఆనందంగా వుందన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఆ సమయంలో డ్రాగన్ కాప్స్యూల్ భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంథానమవడానికి ముందుగా డ్రాగన్ రెండుసార్లు భూమి చుట్టూ తిరిగింది. అంతరిక్ష నౌక నుంచి వీడియో లింక్ద్వారా తను అనుభవాలను శుక్లా పంచుకున్నారు. 30రోజులుగా క్వారంటైన్లో వుండిపోవడంవల్ల యాక్సియం మిషన్ ప్రారంభానికి ముందుండే ఉద్వేగానికి తాను దూరమయ్యానన్నారు. ఆ సమయంలో ‘మనం వెళ్ళాలి’ అనే ఆలోచన తప్ప మరేది తన మనసుసలో లేదని అన్నారు. అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువసేపు గడుపుతానన్నారు. తన అనుభవాలను ప్రజలతో పంచుకుంటానని చెప్పారు. దాదాపు 15 నిముషాల పాటు ఈ లైవ్ కాల్ సాగింది.
ఐదో వ్యోమగామి జారు
ఈ మిషన్లో భాగంగా ప్రయోగాలు చేయాల్సిన సైన్స్ ఉపకరణాలతో పాటూ అందమైన ఒక చిన్నారి హంస బొమ్మను కూడా శుక్లా బృందం రోదసీలోకి తీసుకెళ్ళింది. శుక్లా కుమారుడు కియాష్ జంతు ప్రేమికుడు.అందుకే దీన్ని ఎంపిక చేశారు. హంస అనేది విజ్ఞానానికి చిహ్నమని, భారత్లో వివేచనకు, స్వచ్ఛతకు ఇది ప్రతీక అని గ్రూపు కెప్టెన్ శుక్లా వ్యాఖ్యానించారు. దాని పేరు ‘జారు’. ఈ పేరును హంగేరి వ్యోమగామి టిబర్ కపు పెట్టారు. వ్యోమగాముల్లోని మిషన్ స్ఫూర్తికి ఇది ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు ఈ హంసతో పోలెండ్, హంగేరిలకు కూడా సాంస్కృతిక సంబంధాలున్నాయని శుక్లా తెలిపారు. వ్యోమగాముల మధ్య సాంస్కృతిక ఐక్యతకు ఒక చిహ్నంగా ఇది వుందని యాక్సియం మిషన్ పేర్కొంది. పరిశోధనలంటే కేవలం రాకెట్లు, సైన్స్ ఉపకరణాలే కాదని, భావోద్వేగాలు, సాంస్కతిక, సాంప్రదాయాలు కూడా అని దీనితో రుజువైందని యాక్సియం మిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష కేంద్రం రూపొందించింది. విభిన్నమైన సంస్కృతులకు ప్రతినిధులైన వ్యోమగాముల మధ్య వారధిగా ఈ జారు నిలిచింది.
జీరో గ్రావిటీ ఇండికేటర్ !
ఈ జారును శూన్య గురుత్వాకర్షణ సూచీగా చూస్తారు. డ్రాగన్ కాప్స్యూల్ రోదసీలోకి వెళ్ళగానే జారు భార రహిత స్థితిలో తేలియాడింది. దీంతో గురుత్వాకర్షణ శూన్యమైందని వ్యోమగాములకు స్పష్టమవుతుంది. దీంతో వారందరూ రోదసీలోకి ప్రవేశించామని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. భార రహిత స్థితికి చేరిన సూచనగా ఒక బొమ్మను ఎగురవేయడం రోదసీలోకి అడుగిడిన తొలి మానవుడు యూరి గగారిన్తో మొదలై అటు తర్వాత రోదసీ యాత్రల్లో ఒక సాంప్రదాయంగా మారింది.
ఈ భూమి మనందరిదీ
ఈ రోదసీ యాత్రలు మానవుని దృక్పథాన్ని మారుస్తాయని తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. ఈ భూమి ఏ ఒక్కరి సొత్తో కాదని, ఇది మనందరిదీ అని అర్ధమవుతుందని అన్నారు.
న్యూఢిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా గురువారం రికార్డు సృష్టించారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా బుధవారం శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములను తీసుకుని వెళ్ళిన డ్రాగన్ అంతరిక్ష నౌక భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.01 గంటలకు అంతరిక్ష కేంద్రంతో అనుసంథానమైంది. 4.15 గంటలకు మొత్తంగా డాకింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ తర్వాత కాసేపటికి నలుగురు వ్యోమగాములు స్టేషన్ లోకి చేరుకున్నారు. పరస్పర కరచాలనాలు, ఆలింగనాలతో అక్కడ కాసేపు సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఇక ప్రయోగాలకు సర్వం సిద్ధమైనట్లైంది.
చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నా
అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళడానికి ముందుగానే శుక్లా అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడారు. ‘ప్రజలకు రోదసీ నుండి నమస్కారం’ అని శుక్లా చెప్పారు. భారరహిత స్థితిలో ఎలా జీవించాలో చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఈ శూన్యంలో ఇలా తేలియాడుతూ వుండడం అద్భుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తోటి వ్యోమగాములతో ఇలా కలిసి వుండడం ఆనందంగా వుందన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఆ సమయంలో డ్రాగన్ కాప్స్యూల్ భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంథానమవడానికి ముందుగా డ్రాగన్ రెండుసార్లు భూమి చుట్టూ తిరిగింది. అంతరిక్ష నౌక నుంచి వీడియో లింక్ద్వారా తను అనుభవాలను శుక్లా పంచుకున్నారు. 30రోజులుగా క్వారంటైన్లో వుండిపోవడంవల్ల యాక్సియం మిషన్ ప్రారంభానికి ముందుండే ఉద్వేగానికి తాను దూరమయ్యానన్నారు. ఆ సమయంలో ‘మనం వెళ్ళాలి’ అనే ఆలోచన తప్ప మరేది తన మనసుసలో లేదని అన్నారు. అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువసేపు గడుపుతానన్నారు. తన అనుభవాలను ప్రజలతో పంచుకుంటానని చెప్పారు. దాదాపు 15 నిముషాల పాటు ఈ లైవ్ కాల్ సాగింది.
ఐదో వ్యోమగామి జాయ్
ఈ మిషన్లో భాగంగా ప్రయోగాలు చేయాల్సిన సైన్స్ ఉపకరణాలతో పాటూ అందమైన ఒక చిన్నారి హంస బొమ్మను కూడా శుక్లా బృందం రోదసీలోకి తీసుకెళ్ళింది. శుక్లా కుమారుడు కియాష్ జంతు ప్రేమికుడు.అందుకే దీన్ని ఎంపిక చేశారు. హంస అనేది విజ్ఞానానికి చిహ్నమని, భారత్లో వివేచనకు, స్వచ్ఛతకు ఇది ప్రతీక అని గ్రూపు కెప్టెన్ శుక్లా వ్యాఖ్యానించారు. దాని పేరు ‘జారు’. ఈ పేరును హంగేరి వ్యోమగామి టిబర్ కపు పెట్టారు. వ్యోమగాముల్లోని మిషన్ స్ఫూర్తికి ఇది ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు ఈ హంసతో పోలెండ్, హంగేరిలకు కూడా సాంస్కృతిక సంబంధాలున్నాయని శుక్లా తెలిపారు. వ్యోమగాముల మధ్య సాంస్కృతిక ఐక్యతకు ఒక చిహ్నంగా ఇది వుందని యాక్సియం మిషన్ పేర్కొంది. పరిశోధనలంటే కేవలం రాకెట్లు, సైన్స్ ఉపకరణాలే కాదని, భావోద్వేగాలు, సాంస్కతిక, సాంప్రదాయాలు కూడా అని దీనితో రుజువైందని యాక్సియం మిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష కేంద్రం రూపొందించింది. విభిన్నమైన సంస్కృతులకు ప్రతినిధులైన వ్యోమగాముల మధ్య వారధిగా ఈ జారు నిలిచింది.
జీరో గ్రావిటీ ఇండికేటర్ !
ఈ జారును శూన్య గురుత్వాకర్షణ సూచీగా చూస్తారు. డ్రాగన్ కాప్స్యూల్ రోదసీలోకి వెళ్ళగానే జారు భార రహిత స్థితిలో తేలియాడింది. దీంతో గురుత్వాకర్షణ శూన్యమైందని వ్యోమగాములకు స్పష్టమవుతుంది. దీంతో వారందరూ రోదసీలోకి ప్రవేశించామని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. భార రహిత స్థితికి చేరిన సూచనగా ఒక బొమ్మను ఎగురవేయడం రోదసీలోకి అడుగిడిన తొలి మానవుడు యూరి గగారిన్తో మొదలై అటు తర్వాత రోదసీ యాత్రల్లో ఒక సాంప్రదాయంగా మారింది.
ఈ భూమి మనందరిదీ
ఈ రోదసీ యాత్రలు మానవుని దృక్పథాన్ని మారుస్తాయని తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. ఈ భూమి ఏ ఒక్కరి సొత్తో కాదని, ఇది మనందరిదీ అని అర్ధమవుతుందని అన్నారు.