Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇరాన్‌తోపాటు గల్ఫ్‌ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని తెలిపారు.

ఇరాన్‌, ఇతర గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని పేర్కొన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్‌తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని రేవంత్‌ ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -