- Advertisement -
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారం నూతన సంవత్సరం, వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయాన్ని, శివాలయాన్ని సతి సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీరజ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు ప్రశాంత్ రెడ్డి దంపతుల ఆశీర్వాదము తీసుకొన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
- Advertisement -



