కొత్త మంత్రుల శాఖలివే..
అడ్లూరికి సంక్షేమం, వివేక్కు కార్మిక, మైనింగ్ వాకాటికి క్రీడలు, పశుసంవర్దక శాఖలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై మూడు రోజుల ఉత్కంటకు తెరపడింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయిస్తు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి వ్యక్తుల సాధికారిత శాఖలు, గడ్డం వివేక్కు కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖలు, వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థకం, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్య్స సంపద శాఖలను కేటాయించారు. తాజా విస్తరణతో క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. పాతమంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా.. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే వారికి కేటాయించారు. కొత్త మంత్రులు గురువారం పదవి బాద్యతలు చేపట్టనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES