Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – భూపాలపల్లి  : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2005- 2006 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు విద్యార్థినిలు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందించారు. బాల్యం చాలా విలువైనది, అమూల్యమైనది అని అటువంటి బాల్యాన్ని మళ్లీ తిరిగి పొందలేమని ఆరోజుల్లో జరిగినటువంటి జ్ఞాపకాలు జీవితాంతం మర్చిపోలేనివని వారు గుర్తు చేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు విద్యార్థులు కూర్చునే బెంచీలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బింగి శ్యామ్ చుక్క రాజు సముద్రాల నరేష్ కీర్తి రాజు , బీరెల్లి సురేష్, సిహెచ్ వేణు, కవిత, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -