Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటాపూర్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

కాటాపూర్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి: మండలంలోని కాటాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో 2002-03 లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన పలువురు పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని ఉపన్యాసాల్లో పేర్కొన్నారు. 

23 ఏళ్ళ తరువాత కూడా తమను గుర్తుంచుకొని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చింతల ఉపేందర్, అంగోతు రాందాస్, కుంజ కళ్యాణి, బి డి నాయక్, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కర్ణకంటి రాంమూర్తి, తడక ప్రభాకర్, చంద్రారెడ్డి, సత్యనారాయణ, మరియు పూర్వ విద్యార్ధులు మేడిశెట్టి నరేష్, తాటి సురేష్, శనిగరపు చిరంజీవి, తుర్క ప్రభాకర్, యానాల వెంకటేష్, నామాల రమేష్, సట్ల సాగర్, పుల్లూరి నాగేష్, గద్దల శ్రీను, తోట నవీన్, శైలజ, మాధవి, మోరె శైలజ, కాయితి నాగశ్రీ, స్వాతి, 38 మంది విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -